ఏపీ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటాం – తెలంగాణ మంత్రి గంగుల

-

సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత.. ఏపీ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీనే కాదు.. కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్ర రాష్ట్రాలు కూడా కేసీఆర్‌… నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు.

అలాగే సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో పెట్టుకుంటే 2014లో ఎలా ఉద్యమం చేశామో మర్చిపోయారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తమతో ఎందుకు గోక్కుంటున్నారు అని ప్రశ్నించారు. మళ్లీ 2014 వంటి ఘటన పునరావృతం చేయాలా? అన్నారు గంగుల. జగన్ బిజెపికి బీ టీం గా వ్యవహరిస్తున్నారని అన్నారు. పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news