ఆర్జీవీకి జరిమానా వేసిన జీహెచ్‌ఎంసీ..!

-

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. ‘పవర్‌స్టార్‌’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్ఎంసీ రూ.4,000 చెల్లించాలని చలానా జారీ చేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన అధికారులు వర్మకు జరిమానా విధించారు.

ఈ నెల 22న ఈ మేరకు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో అంటించిన రెండు పోస్టర్లకు గాను ఒక్కో దానికి రూ.2 వేల చొప్పున రూ.4 వేలు జరిమానా వేశారు. చలానాను జూబ్లీహిల్స్‌, గాయత్రిహిల్స్‌లోని  ఆర్‌జీవీ అడ్రస్ కు పంపనున్నట్టు ఈవీడీఎం వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వర్మ తీసిన ‘పవర్‌స్టార్‌’ సినిమా ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news