గడప గడపకి వెళ్తుంటే ప్రజలు చెప్పులతో కొడుతున్నారని జూమ్ లోకి వచ్చారు: అయ్యన్న పాత్రుడు

-

పదవ తరగతి విద్యార్థులతో టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే జూమ్ మీటింగ్ నడుస్తుండగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని లు మధ్యలో ఎంటర్ అయ్యారు.

వాళ్ళిద్దరూ ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడం పై టిడిపి నేతలు మండిపడుతున్నారు.ఇప్పటికే లోకేష్, అచ్చెన్నలు దీనిపై స్పందించగా.. తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కొడాలి నాని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కొడాలి నాని పై తీవ్ర పదజాలంతో దూషించారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సన్నబియ్యం ఇచ్చే విషయంలో కోడలి వైఫల్యాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

“8 క్లాస్ ఫెయిల్ అయిన సన్నబియ్యం సన్నాసి టెన్త్ క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం. గడపగడపకు వెళ్తుంటే ప్రజలు చెప్పులతో కొడుతున్నారని అందుకే ఆ కార్యక్రమం వదిలేసి జూమ్ కి వచ్చారని అన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తే జనం పరిగెత్తించి కొడతారనే భయంతోనే పరదాలు కట్టుకుని వెళుతున్నాడు.” అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news