మహిళలకు షాక్…భారీగా పెరిగిన బంగారం ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరగగా…. వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 కు పెరిగి.. రూ. 49,910 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి.. రూ. 45,750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగాయి. నిన్న కంటే రూ. 800 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news