ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్…వెనక్కి తగ్గిన సర్కార్..

-

తెలంగాణ ప్రభుత్వంపై జనాలకు ఇప్పటికే నమ్మకం పోయింది..పథకాల కోత పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వారికి మరో న్యూస్ ఆగ్రహానికి ఆజ్యమ్ పోసింది.టీచర్ల ఆస్తిని ప్రకటించాలనే ఉత్తర్వుల జారీ చేసిన విషయం తెలిసిందే..కాగా, ఈ విషయం పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని విద్యాశాఖ కార్యదర్శి మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు.నిలిపివేత ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సూచించారు. అంతకుముందు విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు టీచర్లు ఫ్లాట్‌ కొనుగోలు చేసినా, ప్లాట్‌ కొనుగోలు చేసినా, ఖరీదైన ఆభరణాలు కొన్నా లెక్కలు చెప్పాలని ఆదేశిస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు..

మంత్రి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..టీచర్లలో గందరగోళం ఏర్పడటం.. ప్రతి పక్షాలకు ఇదో అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజిలెన్స్‌ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటు జరిగిందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు..ఈ నిర్ణయంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news