మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ. 59 కే రోజంతా ప్రయాణం

-

మెట్రో ప్ర‌యాణం అంటే.. చాలా మంది భ‌య‌ప‌డుతారు. గ‌మ్యానికి ఎక్కువ‌ వేగంగా చేర్చే మెట్రో ప్ర‌యాణం.. ఛార్జీలు కూడా అంతే.. ఎక్కువగా ఉన్నాయి. అయితే మెట్రో ప్ర‌యాణికుల‌కు ఛార్జీలపై హైద‌రాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సూప‌ర్ సేవ‌ర్ అనే పేరుతో ఒక కార్డును హైద‌రాబాద్ మెట్రో తీసుకువ‌చ్చింది. ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు ను రూ. 59 కే అందించ‌నున్నారు. ఈ సూప‌ర్ కార్డు ద్వారా రోజంతా.. మెట్రోలో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.

Metro
Metro

అయితే ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు.. సెల‌వు దినాలల్లో మాత్ర‌మే అందుబాటు లో ఉండ‌నుంది. మెట్రో అధికారులు తెలిపే 100 సెల‌వు రోజుల్లో ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ కే. వీ. బీ రెడ్డి తెలిపారు. ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డుల‌ను ఉగాది నుంచి తీసుకురానున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ప్రతి రెండో, నాలుగో శ‌నివారాలతో పాటు ప్ర‌తి ఆదివారం కూడా ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు అందుబాటు లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత‌.. మెట్రో ప్ర‌యాణికుల సంఖ్య పెంచుకోవ‌డానికి ఈ ఆఫ‌ర్ తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news