నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేసుకోండి..

-

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగాలకు సంభంధించిన మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆ నోటిఫికేషన్ ద్వారా 1050 పోస్టులను భర్థీ చేయనుంది..మొత్తం 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ EDP విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు..ఆసక్తి కలిగిన విద్యార్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు…

ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాలు..

మొత్తం:1050

మైనింగ్: 699

సివిల్: 160

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్:124

సిస్టం అండ్ ఈడీపీ: 67

మైనింగ్: ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి.

సివిల్: సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్: ఈ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

సిస్టం అండ్ ఈడీపీ: కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి…

వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి.

జీతం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది.
అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు..www.coalindia.in..ఈ వెబ్ సైట్ ద్వారా పూర్తీ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news