రైతులకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ అకౌంట్లలోకి రూ.2,000..!

-

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఈ పథకంలో 10 కోట్లకు పైగా రైతులు చేరారు. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకంలో భాగంగా మరో విడత డబ్బుల్ని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్ట్ 1 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.2,000 జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అప్లై చేయనివారు ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందొచ్చు.

దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌ సైట్‌ కు వెళ్లి మీరే పథకంలో చేరవచ్చు. కాగా, ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ.74,000 కోట్లు జమ చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఆరో విడత డబ్బుల్ని జమ చేయనుంది. అలాగే రూ.లక్ష కోట్లతో రైతుల కోసం అగ్రిక్చర్ ఫండ్‌ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news