కరోనా అలర్ట్ : తెలంగాణలో 24 గంటల్లో ఎన్ని కేసులో తెలుసా.!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ప్రజలు, ప్రముఖులు, నాయకులు, అధికారులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,278 కొత్త కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇందులో 762 కేసులు హైదరాబాద్‌ మున్సిపల్ ‌కార్పొరేషన్‌ పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 32,224 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా వల్ల ఇవాళ 8 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. కరోనా ‌నుంచి కోలుకొని ఇళ్లకు మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news