ప్రతి ఒక్కరి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి- తెలంగాణ గవర్నర్

-

ప్రతి ఒక్కరి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులకు జాతీయ జెండాలను, దుస్తులను హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం భాగంగా పంపిణీ చేశారు గవర్నర్. ఈ సందర్భంగా తమిళ్ సై మాట్లాడుతూ.. 75 వ స్వతంత్ర దినోత్సవంను పండగ గా సంతోషంగా జరుపుకోవాలని.. వర్షాల కారణంగా చాలా మంది ఇంట్లోని నిత్యవసర వస్తువులు కోల్పోయారు.

ఈ సందర్భంగా వారికి బట్టలు ఇతర దుస్తులు అందించడం జరిగిందని తెలిపారు. జెండా తీసుకున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని.. రాష్ట్రంలో వ్యాక్సిన్ యొక్క బూస్టర్ రేట్ తక్కువగా ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కి సంబంధించిన బూస్టర్ డోస్ వేసుకోవాలని.. లక్షణాలు ఉంటే కూడా వ్యాప్తి అంతగా ఉండదని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి… స్టూడెంట్స్ కి వివిధ కాంపిటీషన్ లు పెట్టి అందులో నుండి 75 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.

Read more RELATED
Recommended to you

Latest news