త్వరలోనే కొమురవేల్లికి రైల్వే స్టేషన్ తెప్పిస్తా – గవర్నర్ తమిళి సై

-

త్వరలోనే కొమురవేల్లికి రైల్వే స్టేషన్ తెప్పిస్తానని సంచలన ప్రకటన చేశారు గవర్నర్ తమిళి సై. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి బయలుదేరారు గవర్నర్ తమిళి సై. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. కార్తీకమాసంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని పూజలు చేశానని.. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ కావాలని భక్తులు కోరారన్నారు. వీలైనంత త్వరగా కొమురవేల్లి కి రైల్వే స్టేషన్ తెప్పించే ప్రయత్నం చేస్తానని.. నా సర్వదికారాలు ఉపయోగించి కృషి చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్ వెళ్ళగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు గవర్నర్ తమిళి సై.

Read more RELATED
Recommended to you

Latest news