ఈ నెల 17న సికింద్రాబాద్, 24న ఓల్డ్ సిటీ బోనాలు – తలసాని శ్రీనివాస్

-

ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామని చెప్పారు.

ఈ నెల 17 న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు చేస్తామని వెల్లడించారు తలసాని.

ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు జరుగుతాయని..
గతంలో కంటే అధికంగా భక్తులు రానున్నారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news