లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్​’కు చోటు

-

తెలంగాణ పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ఎంపీ సంతోశ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు అందరితో మొక్కలు నాటించారు. ఒకరు మొక్కలు నాటి మరో ఇద్దరు ముగ్గురికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసరడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ బాధ్యత కూడా నాటిన వారిదే.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మొదలై.. అంతకుమించి విజయమార్గంలో దూసుకెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు దక్కించుకుంది. సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ కార్యక్రమ సృష్టికర్త, ఎంపీ సంతోశ్ కుమార్​కు చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సల కౌల్​బెనర్జీ తెలిపారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ చేతుల మీదుగా ఎంపీ సంతోశ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమై.. ఈ రికార్డు సాధించడానికి కారణమైన మాజీ మంత్రి జోగు రామన్నకు సంతోశ్ కృతజ్ఞతలు తెలిపారు. జోగు రామన్న తన పుట్టిన రోజు సందర్భంగా 2021లో జులై4న 16,900 మంది సాయంతో 3,54,900 మొక్కలు నాటించారని తెలిపారు. మరోవైపు సమష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version