సంగీత దర్శకుడు ఇళయరాజాకు జీఎస్టీ నోటీసులు..

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పోల్చితూ ఇళయరాజా ఇటీవల చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆయనకు జిఎస్టి చెన్నై శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.జీఎస్టీ కింద 1.8 రూపాయల మేరకు పన్నులు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ నోటీసులను జిఎస్టి చెన్నై శాఖ కార్యాలయం జారీ చేసింది. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు.కాగా ఇప్పటికే ఈ పన్ను చెల్లింపులకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా మరోమారు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news