మొత్తం 7 స్థానాలు గెలిచి తీరుతాం – మంత్రి అమర్నాథ్‌

-

ఏపీలో జరుగుతున్న మొత్తం ఎమ్మెల్సీ స్థానాలను గెలిస్తామని వెల్లడించారు ఏపీ మంత్రి అమర్నాథ్‌. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది పోలింగ్. ఇక ఈ ఎన్నికలపై ఏపీ మంత్రి అమర్నాథ్‌… స్పందించారు. చంద్రబాబుకు ముందు నుంచి మైండ్ గేమ్ ఆడటం అలవాటు అని ఫైర్‌ అయ్యారు.

వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ సందర్భంలోనూ తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బలం లేకపోయినా చంద్రబాబు అభ్యర్థిని బరిలో పెట్టి, సూట్ కేసులు పంపిన విషయం చూశామన్నారు ఏపీ మంత్రి అమర్నాథ్‌. ఇప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేస్తుండవచ్చు. మొత్తం 7 స్థానాలు గెలిచి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి అమర్నాథ్‌.

Read more RELATED
Recommended to you

Latest news