IPL 2022 : హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ వేసిన గుజరాత్

-

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. నిన్న హైదరాబాద్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన గుజరాత్ జట్టు… ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో తీవేటియ, రషీద్ ఖాన్ మెరవడం తో గుజరాత్ విజయం సాధించింది.

చివరి బంతి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠo గా జరుగగా… చివరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు రషీద్ ఖాన్. దీంతో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించిన గుజరాత్ జట్టు… పాయింట్స్ టేబుల్ లో.. మొదటి స్థానానికి చేరుకొంది.

ఇటు హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఇరగదీశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో… 25 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు ఎవరు కూడా వికెట్లు తీయగా పోవడంతో మ్యాచ్ హైదరాబాద్ నుంచి చేజారింది.

Read more RELATED
Recommended to you

Latest news