తెలంగాణలో బీజేపీ సీబీఐ, ఐటీ దాడులు చేయించబోతుంది : ఎమ్మెల్సీ గుత్తా

-

తెలంగాణలో బీజేపీ సీబీఐ, ఐటీ దాడులు చేయించాలని చూస్తుందని ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గుత్తా మాట్లాడుతూ… దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆరాచాక పాలన సాగించాలని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని ఫైర్‌ అయ్యారు.

బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని చెబుతున్నారు…. బీజేపీ విధానాలతో కేసీఆర్ కాదు ప్రజలు భయపడుతున్నారని మండి పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా సీబీఐ, ఐటీ దాడులతో ఒత్తిడికి గురి చేస్తున్నారు…ఇదే పద్దతిని తెలంగాణలో చేయాలని చూస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. ప్రజలు, నాయకులను జైల్లో పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే దురుద్ధేశాలతో ద్వంద విధానాలతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, రైతులను ఇబ్బందులు పెట్టేలా బీజేపీ చేస్తోందని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news