శ్రీహ‌రికోట‌లో క‌రోనా క‌ల‌క‌లం… 14 మందికి క‌రోనా…

-

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ అనుమానంతో ఈ 14 మంది నమూనాలను ల్యాబ్ కు పంపారు అధికారులు. ఇక కరోనా వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న పలువురు ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.

అంతేకాదు.. కరోనా విజృంభించడంతో… ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు అధికారులు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిష్టర్లు ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే… ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 103 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 608 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 498 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news