టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ సీఎం కావడం పక్కా !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు హరి రామజోగయ్య. ఏపీలో వైసీపీ పాలన అంతం అందించేందుకు టిడిపి మరియు జనసేన పొత్తు అవసరమని కాపు నేత చేగొండి హరి రామ జోగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

టిడిపి మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని వెల్లడించారు. కాపులకు విద్య మరియు ఉద్యోగాల్లో, రిజర్వేషన్ దక్కించుకోవాలంటే రాజ్యాధికారం అవసరమని తెలిపారు. బడుగు మరియు బలహీన వర్గాల రాజ్యమే కాపు సంక్షేమ సేన లక్ష్యమని ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అందురు పైన ఉందని స్పష్టం చేశారు హరి రామజోగయ్య.

Read more RELATED
Recommended to you

Latest news