తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ డేట్ ఫిక్స్

-

వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తామని.. రాష్ట్రం లో యాభై ఎడు ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఇవాళ హుజూరాబాద్ నియోజక వర్గ ప్రచారం లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఈటల కట్టలేదని ఫైర్ అయ్యారు. ధరలు పెంచిన బిజెపి కి ఓటు వేయాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్పా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల కోట్లు తీసుకొస్తా పెంచిన ధర తగ్గిస్త అని చెప్పాలని.. టీఆరెఎస్ పార్టీ ఎం చేసిందో చెప్పింది బిజెపి ఎం చేస్తుందో చెప్పాలన్నారు. రెండున్నర సంవత్సరాల కోసం గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని.. ఉద్యమకారుడు బీద కుటుంబం నుండి వచ్చిన గెళ్లు శ్రీనివాస్ కు ఓటు వేయాలని కోరారు.

రైతు లకు ఉచిత విద్యుత్ కోసం సిఎం ముఖ్యమంత్రి చాలా ఖర్చు పెట్టారని.. రైతు బంధు,రైతు భీమ , ఉచిత విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రైతు ల వద్ద ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవద్దు రైతు రుణాల వడ్డీ నీ ప్రభుత్వమే కడుతుందాని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news