వంద ఎలుకలు తిన్న పిల్లి అది : శివరాజ్ సింగ్ హరీష్ రావు సెటైర్

-

శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని.. ‌ వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని చురకలు అంటించారు మంత్రి హరీశ్ రావు. తెరాసాను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు నీకు‌లేదని.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం అయ్యావని ఫైర్ అయ్యారు. నాలుగేళ్ళు సీఎం అయి ఎం సాధించావు.. తెలంగాణతో‌ మీ రాష్ట్రం దేనికి పోలిక ? అని ప్రశ్నించారు.

ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది… మీరా అవినీతి కోసం మాట్లాడేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానం గా స్పష్టంగా చెప్పారన్నారు. ‌ మరి మీ మధ్యప్రదేశ్ లో పెద్ద కుంభకోణం జరిగింది‌.. వ్యాపం కుంభకోణం దాని సంగతి ఏంటి ? అని ప్రశ్నించారు.

ఎవరికైనా శిక్ష పడిందా… మనుషులనే మీరు చంపేసారు. మీ కుంటుబ‌ సభ్యుల మీద , మీ పార్టీ నేతలు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని ఫైర్ అయ్యారు. 317 జీవో రద్దు చేయాలా‌‌…అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? అని ప్రశ్నించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా ? నిరుద్యోగులకు ఉద్యోగాలు‌ రావాలని సీఎం గారు భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దను బీజేపీ కుట్ర చేస్తోందని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news