విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి : హరీశ్‌ రావు

-

వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు నేడు సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు వారికోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బాగా ఆకర్షితులవుతారని, వారు ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు మంత్రి హరీశ్‌ రావు. సిద్ధిపేట కలెక్టరేట్ లో హరీశ్ రావు ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

10వ తరగతి ఉత్తీర్ణతలో తెలంగాణలో సిద్ధిపేట జిల్లా తొలి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా తొలి స్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్థులకు రూ. 10 వేల బహుమానం ఇస్తానని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. అంతేకాకుండా.. 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ. 25 వేలు బహుమతిగా ఇస్తానని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టాలని హెడ్మాస్టర్లను ఆదేశించారు మంత్రి హరీశ్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news