కవిత బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా..!

-

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మే 27కు వాయిదా పడింది. కవిత పిటిషన్ పై ఇవాళ విచారణ జరగగా ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ మాత్రం కౌంటర్ దాఖలుకు గడువు కోరింది. బెయిల్ పిటిషన్ పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 17న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబిఐ కోర్టుకు తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించిన కోర్టు.. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news