బ్రేకింగ్ : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..!

-

బంగాళాఖాతంలో రేపు ఏర్పడబోయే అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్ పై కొనసాగుతున్న అల్పపీడనం బలపడటం, తమిళనాడు తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు, దక్షిణ చత్తీస్ గఢ్ పై మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడనుందని, దీంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ గురు వారాల్లో కూడా చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కోస్తా ప్రాంతంపై బాగా ఉంటుందని అంటున్నారు అధికారులు. దీంతో రానున్న 2 రోజులు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news