బేకరీలో చోరీకి వెళ్లి.. కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్న దొంగలు

-

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ బేకరీలో చోరీకి వెళ్లారు. కావాల్సినన్ని మిఠాయిలు, ఇతర తినుబండారాలు చోరీ చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లకుండా బేకరీలోని ఓ కేక్ తీసుకుని కట్ చేసి పార్టీ చేసుకున్నారు. తెల్లవారిజామున బేకరీ యజమాని షాపు తెరుద్దామని చూడగా.. షట్టర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే కేకులు కట్ చేసుకుని పార్టీ చేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి.

కేక్ కట్ చేసిన దొంగలు బేకరీలోని బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు ఎత్తుకువెళ్లారు. సుమారు రూ.20వేల విలువగల మిఠాయిలు, తినుబండారాలు ఎత్తుకెళ్లినట్లు యజమాని శశిధర్ తెలిపారు. దుకాణం తాళం పగులగొట్టి షట్టరు తెరిచేందుకు వాడిన పలుగును అక్కడే వదిలేశారు. బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దొంగలు లోపలకు చొరబడిన సమయంలో కౌంటర్‌లో డబ్బులు లేవని, దీంతో ఇలా చేసి ఉంటారని యజమాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news