ఉదయ్ కిరణ్‌తో ఆ సినిమా తీయాలనుకున్న రాజమౌళి..తర్వాత ఏం జరిగిందంటే..?

-

అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలందరూ భావిస్తున్నారు. RRR వంటి విజ్యువల్ గ్రాండియర్ సృష్టించిన రికార్డులను చూసి..కనీసంగా ఒక్క పాత్ర అయినా ఆయన సినిమాలో చేయాలని ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇతర ఇండస్ట్రీల వాళ్లు తమతో రాజమౌళి ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అయితే, రాజమౌళి మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. వాళ్లను పాన్ ఇండియా స్టార్స్ చేస్తున్నాడని చెప్పొచ్చు. కాగా, రాజమౌళి ఆఫర్ ను మిస్ చేసుకున్న హీరోలు కొంత మంది ఉన్నారు. ఆ జాబితాలో దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఉండటం గమనార్హం.

నితిన్ హీరోగా వచ్చిన ‘సై’ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న ఈ ఫిల్మ్..ముందుగా ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లింది. కానీ, అప్పటికే ఫుల్ బిజీగా ఉన్న ఉదయ్ కిరణ్..రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. దాంతో సేమ్ స్టోరిని రాజమౌళి నితిన్ కు వినిపించాడు. అలా ఆ స్టోరిని నితిన్ వెంటనే ఓకే చేయడం, సినిమా రావడం జరిగింది. ఈ సినిమా తిరస్కరించినందుకు తర్వాత ఉదయ్ కిరణ్ బాధపడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయట. రాజమౌళి తన తర్వాత సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news