జర్నీ హీరో జయ్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!

-

జర్నీ సినిమా ఫేమ్ హీరో జయ్ గురించి ప్రేక్షకులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమాతో అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన జయ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఒక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా సదరు హీరోయిన్ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఆమె ఎవరో కాదు వాణి భోజన్.. టీవీ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె వెండితెర కథానాయిక గా ఎదిగింది. మధ్యలో టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె.. అధికారం 97 అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓ మై కడవలే చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత లాకప్ , రామే ఆండాలుమ్ రావణ నే ఆండాలుమ్ తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల మహాన్ చిత్రంలో విక్రమ్ కు జోడిగా నటించింది.. ప్రస్తుతం చేతిలో 10 చిత్రాలతో బిజీగా ఉన్న వాణీ భోజన్.. తాజాగా హీరో జయ్ తో సహజీవనం చేస్తోందని.. అంతేకాదు తాను నటించే చిత్రాల కథలను కూడా అతడే విని ఎంపిక చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు.. వాణి భోజన్ ను కలసి కథలు చెప్పే అవకాశం కూడా లేదన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఇలాంటి ప్రచారంపై ఈమె కాస్త ఆలస్యంగా స్పందించింది. అయితే ఈ విషయం తన వరకూ వచ్చిందని .. ఇది కేవలం వదంతులు మాత్రమేనని కొట్టిపారేసింది.

తాజాగా నటుడు భరత్ కి జంటగా నటించిన మిరల్ చిత్ర నిర్మాణం పూర్తిచేసుకుని ఈనెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తాను డబ్బు కోసమో లేక దర్శక నిర్మాతల కోసమో నటించడం లేదని తెలిపింది. తన కథలను తానే విని నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. జయ్ తో సహజీవనం లాంటివి ఏమీ లేవంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version