కమలంలో ‘హీరోయిన్లు’… ఎవరికి సీటు?

-

ఈ మధ్య బీజేపీ…సినీ గ్లామర్‌ని బాగా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. సినిమా వాళ్ళతో ఓట్లు రాలుతాయని గట్టిగా నమ్ముతున్నట్లు ఉంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ..సినీ హీరోలపై ఫోకస్ పెట్టింది. ఎలాగో పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తులో ఉంది..అటు చిరంజీవికి సైతం దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే నితిన్, నిఖిల్ లాంటి హీరోలతో కూడా భేటీ అయ్యారు.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు రాజ్యసభ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి సినీ ప్రముఖులకు బీజేపీ వల వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి మద్ధతుతో తెలంగాణలో అధికారంలోకి, ఏపీలో బలపడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోలే కాదు..కొందరు హీరోయిన్లు కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉంటున్నారు. ముఖ్యంగా పాతకాలంలో హీరోయిన్లు అయిన జీవిత, కవిత, దివ్యవాణి సైతం బీజేపీలో ఉన్నారు. అయితే జీవిత, రాజశేఖర్‌లు అనేక పార్టీలు మారుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక చివరిగా బీజేపీలో ఉన్నారు.

మంచి స్పీకర్‌గా ఉన్న జీవిత తెలంగాణ బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. అలాగే ఆమె చేత ప్రచారం చేయించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జీవిత సీటు కూడా అడుగుతున్నట్లు తెలిసింది. అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన కవిత కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఆమె ఏపీ కంటే తెలంగాణలోనే పనిచేయాలని చూస్తున్నారు.

మొన్నటివరకు ఏపీ టీడీపీలో హల్చల్ చేసిన దివ్యవాణి సైతం..తాజాగా ఈటల రాజేందర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా తెలంగాణ బీజేపీలో ఎంట్రీ ఇచ్చేలా ఉన్నారు. అటు ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయశాంతి ఎలాగో బీజేపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక సీనియర్ నటి జయప్రద సైతం బీజేపీలో చేరారు. అలాగే జయసుధ కూడా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. మరి ఈ హీరోయిన్లలో సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news