హైదరాబాద్ పబ్స్ పై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు

-

హైదరాబాద్ పబ్స్ పై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుండి రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ పెట్టరాదని హైకోర్టు పేర్కొంది. రాత్రి 10 నుండి తెల్లవారుజాము 6 వరకు ఎటువంటి సౌండ్ పెట్ట రాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని పేర్కొంది. రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టం కు అనుమతి లేదని హై కోర్టు స్పష్టం చేసింది.

ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇల్లు, విద్యా సంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలా అనుమతి ఇచ్చారని హై కోర్టు ప్రశ్నించింది. పబ్ లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. పబ్ లో రాత్రి పూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని హైకోర్టు పేర్కొంది. ఇటీవల టాట్ పబ్ విషయం పై హై కోర్టు కి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరుపున వాదించారు హై కోర్టు న్యాయవాది కైలాష్ నాథ్. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news