హన్మకొండలో హై టెన్షన్.. బీజేపీ, టీఆర్ఎస్ నిరసనలు !

-

టీఆరెస్ బీజేపీ పరస్పర దాడుల నేపథ్యంలో హన్మకొండలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు వరంగల్ కు రాష్ట్ర బీజేపీ నేతలు  స్థానిక నేతలను పరామర్శించేందుకు వస్తుండగా ఒక వైపు పరకాలలో టీఆరెస్ కార్యకర్తలు బంద్ కు పిలిపునిచ్చారు. ఇంకో వైపు. అరెస్ట్ చేసిన బీజేపీ నేతల ను కోర్టులో ప్రవేశ పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు పోలీసులు.

హైదరాబాద్ నుంచి హనుమకొండ కు వెళుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ భువనగిరిలో అరెస్టు చేసిన పోలీసులు భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరకాల నియోజక వర్గంలోని అన్ని మండలం కేంద్రాలలో ప్రశాంతగా బంద్ కొనసాగుతోంది. టిఆర్ఎస్ కార్యకర్తలు బైక్స్ పైన తిరుగుతూ బంద్ చేయాలంటూ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news