పండుగ పూట : గ్యాస్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

-

గత కొన్ని నెలలుగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రూ. 450 లకు ఉన్న సిలిండర్ ప్రస్తుతం రూ. 900 క్రాస్ అయింది. దీంతో సామాన్య ప్రజలు… పెరిగిన గ్యాస్ ధరల కారణంగా చుక్కలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… హిందుస్థాన్ పెట్రోలియం తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

gas
gas

గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచిన నేపథ్యంలో నవరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆఫర్ ను కల్పిస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం తన వినియోగదారులకు నవరాత్రి సందర్భంగా గ్యాస్ సిలిండర్ కొనుగోలు పై పదివేల వరకు బంగారం గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

హిందుస్థాన్ పెట్రోలియం యొక్క బంపర్ నవరాత్రి ఆఫర్ పీరియడ్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 16 వ తేదీ ల మధ్య ఉండనుంది. ఈ ఆఫర్ కింద ఐదుగురు లక్కీ విజేతలను ప్రతిరోజు ఎంపిక చేస్తారు. ఈ ఆఫర్ సమాచారాన్ని హిందుస్థాన్ పెట్రోలియం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించవచ్చని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news