భారత జనాభా మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసా..?

-

సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం చాలా కష్టాలు పడుతుంది. ఈ ఉపద్రవం నుండి కాపాడేది వ్యాక్సినేషన్ మాత్రమే అని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గినా థర్డ్ వేవ్ ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచన ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి భారతదేశంలో వ్యాక్సిన్ కొరత ఉంది. ఇప్పటిఖే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.

ఐతే భారత దేశ జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం మొత్తం జనాభా అంటే 18నుండి 45మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ వేయడానికి 32నెలలు పడుతుందట. అంటే రెండు సంవత్సరాల 8నెలలు అన్నమాట. భారత దేశ ప్రజలందరికీ రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పడుతుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version