‘పోకిరి’ వైబ్స్..మహేశ్ ‘సర్కారు వారి పాట’పై పెరుగుతున్న అంచనాలు..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన నటించిన ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొవిడ్ ప్రభావం వలన చిత్రాల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.

వచ్చే నెల 12న ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మహేశ్ నటించిన ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా అంచనాలు మరింత పెరిగాయి.

‘సర్కారు వారి పాట’ చిత్ర పాటలు, పోస్టర్స్ చూస్తుంటే సూపర్ హిట్ ఫిల్మ్ ‘పోకిరి’ వైబ్స్ ఉన్నాయని, ఈ సినిమా ఆ చిత్రాన్ని మించిన విజయం సాధిస్తుందని కృష్ణ-మహేశ్ అభిమానులు అంటున్నారు. నిజానికి ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్ ఫ్లేవర్ ఉంటుందని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో మహేశ్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

మహేశ్ బాబు కెరీర్ ను ఇంకా స్ట్రాంగ్ చేసిన చిత్రం ‘పోకిరి’. కాగా, చాన్నాళ్ల తర్వాత ఆ ఫ్లేవర్ సినిమాను మహేశ్ తన అభిమానులు, సినీ ప్రేక్షకులకు అందించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ ఇప్పటికే చాలా సార్లు ‘సర్కారు వారి పాట ’ఫిల్మ్.. ‘పోకిరి’కి మాత్రం తగ్గదని అన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు హడావిడి చేసేస్తున్నారు. చూడాలి మరి ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీసు వద్ద ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందో. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా, మహేశ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news