పెద్దపల్లి: జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంథని మండలంలో గోదావరి తీరం వెంబడి పొలాల్లోకి వరద నీరు చేరింది. మంథని గౌతమేశ్వరస్వామి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఆలయంలో 28 మంది భక్తులు భక్తులు చిక్కుకున్నారు. పూజారి సహా 10 కుటుంబసభ్యులు ఆలయంలోనే ఉండిపోయారు. గోదావరిలో చేపట వేటకు వెళ్లిన 11 మంది మత్య్సకారులు కూడా గౌతమేశ్వరస్వామి ఆలయంలో చిక్కుకున్నారు. నిద్ర చేసేందుకు వెళ్లిన భక్తులు కూడా ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయం చుట్టూ నీరు చేరడంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏం జరుగుతుందోనంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం.. దేవాలయంలో అనుకోని ఘటన!
-