దారుణం : ఆవుపై మాన‌వ మృగం అత్యాచారం.. మృతి చెందిన గోమాత‌

-

దేశంలో కామాందుల ఆగ‌డాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాయి వ‌రుస‌లు, మనుషులు, జంతువులు అని తేడా లేకుండా అఘాత్యానికి పాల్ప‌డుతున్నారు. తెలంగాణ లో ఒక దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక యువ‌కుడు.. ఆవుపై అఘాత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లాలోని పిప్రి అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న అనంత‌రం ఆవును క‌ట్టేసి ఉంచిన తాడు.. బిగిసుకు పోవ‌డంతో ఉరి ప‌డి ఆవు మ‌రణించింది.

కాగ పిప్రి అనే గ్రామంలో సాయ‌న్న అనే వ్య‌క్తి ఇల్లు నిర్మించుకుంటున్నాడు. అయితే ఆ ఇంట్లో.. మార్బుల్స్ వేయ‌డానికి ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి కూలీల‌ను తీసుకువ‌చ్చాడు. ఆ కూలీల్లో విజ‌య్ అనే కిరాత‌కుడు.. అర్థ‌రాత్రి అంద‌రూ ప‌డుకున్న త‌ర్వాత‌.. సాయ‌న్న ఆవును కొత్త ఇంట్లోకి తీసుకువ‌చ్చి.. అత్యాచారం చేశాడు. ఈ క్ర‌మంలో ఆవు.. తీవ్ర ఇబ్బంది ప‌డింది.

మార్బుల్స్ జార‌డంతో మెడ‌కు ఉన్న తాడు బిగుసుకు పోయింది. దీంతో ఆవు మ‌ర‌ణించింది. ఉద‌యం సాయ‌న్న వ‌చ్చి చూసే స‌రికి ఆవు ప్రాణం పోయి ఉంది. ఘ‌ట‌నా స్థ‌లంలో విజ‌య్ అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో పోలీసుల‌కు సాయ‌న్న స‌మాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు.. విజ‌య్ నిందితుడు అని పోలీసులు నిర్ధారించారు. అలాగే అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news