ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి కేరళ టూర్… ఈ ప్రదేశాలను చూసి రావచ్చు..!

-

మీరు కేరళ వెళ్లి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. కేరళ అందాలను ఈ ప్యాకేజీ తో చూసి వచ్చేయచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే పలు రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఫ్లైట్‌లో వెళ్లి కేరళ అందాలు చూసి రావచ్చు. కల్చరల్ కేరళ అనే పేరు తో ఈ ప్యాకేజీ ని అందిస్తున్నారు. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ 2023 అక్టోబర్ 2న మొదలు అవుతుంది. ఈ ప్యాకేజీ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం కవర్ అవుతాయి. మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది ఈ టూర్. తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్‌ లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 6.40 గంటలకు కొచ్చిన్ రీచ్ అవుతారు. ఫ్రెషప్ అయిన తర్వాత కొచ్చి టూర్.

జ్యూయిష్ సినాగోగ్, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఇవన్నీ చూడచ్చు. సాయంత్రం మెరైన్ డ్రైవ్‌లో పాల్గొనొచ్చు. రాత్రికి కొచ్చిలో ఉండాలి. రెండో రోజు మున్నార్. దారిలో చీయపార వాటర్ ఫాల్స్ చూడొచ్చు. టీ మ్యూజియం కూడా చూడవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు మున్నార్ సైట్‌సీయింగ్. మెట్టుపెట్టి డ్యామ్, ఈకో పాయింట్, కుండ్ల డ్యామ్ లేక్ చూడొచ్చు. రాత్రికి మున్నార్‌లో ఉండాలి. నాలుగో రోజు తేక్కడి టూర్.

సుగంధ ద్రవ్యాల తోటలు చూడొచ్చు. రాత్రికి తేక్కడిలో ఉండాలి. ఐదో రోజు అలెప్పీ లేదా కుమారకోమ్ తీసుకెళ్తారు. బ్యాక్‌వాటర్స్‌లో ట్రావెల్ చెయ్యచ్చు. రాత్రికి అలెప్పీ లేదా కుమారకోమ్‌లో ఉండాలి. ఆరో రోజు చడియమంగళం. జటాయు ఎర్త్ సెంటర్ చూడొచ్చు. రాత్రికి త్రివేండ్రంలో ఉండాలి. ఏడో రోజు ఉదయం పద్మనాభ స్వామి ఆలయం చూడవచ్చు. ఆ తర్వాత నేపియర్ మ్యూజియం చూడొచ్చు. ఇక ధర విషయానికి వస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.35,600, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.38,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.52,800.

Read more RELATED
Recommended to you

Latest news