వచ్చే ఎన్నికల్లో జాతీయవాదుల తరఫున ప్రచారం: కంగనా రనౌత్

-

నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో జాతీయవాదుల తరఫున తప్పకుండా ప్రచారం చేస్తాను అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. నర్మగర్భంగా బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలోని బృందావన్‌‌ ఆలయంలో శ్రీ కృష్ణుడి దర్శనం కోసం కంగనా రనౌత్ వచ్చారు. ఆ సమయంలో అక్కడ రిపోర్టర్లతో ఆమె మాట్లాడారు.

వచ్చే ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారా? అని కంగనా రనౌత్ విలేకరులు ప్రశ్నించారు. జాతీయ వాదుల తరఫున తప్పకుండా ప్రచారం చేస్తానని తెలిపారు. శ్రీ కృష్ణుడి నిజమైన జన్మస్థానాన్ని ప్రజలు దర్శించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశఆరు. శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో ఈద్గా ఉందని కంగనా పేర్కొన్నారు. నేను చెప్పేది నిజామో కాదో నిజాయితీపరులు, ధైర్యవంతులు, జాతీయవాదులు, దేశం గురించి మాట్లాడేవారికి తెలుసు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version