ఐఏసీఎస్‌ ప్రవేశాలు..పూర్తీ వివరాలు ఇవే..!

-

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. తాజాగా కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు..ఈ ప్రవేశాల గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాచిలర్స్‌ మాస్టర్స్‌, మాస్టర్స్‌ ఇంటిగ్రేటెడ్‌ , మాస్టర్స్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సైన్స్‌ కు సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు ఉంటుంది. సెమిస్టర్‌ విధానంలో బోధన కొనసాగుతుంది. మొదటి మూడు సెమిస్టర్లలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టులకు సంబంధించిన ఫౌండేషనల్‌ కోర్సులు ఉంటాయి. తరవాత నాలుగో సెమిస్టర్‌ నుంచి పై సబ్జెక్టులలో ఒకదాని మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఏడో సెమిస్టర్‌ నుంచి రిసెర్చ్‌ కోర్సులు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే వారి అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్‌ స్ట్రీమ్‌లో ఇంటర్‌, పన్నెండోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 50 మందిని ఎంపిక చేస్తారు. కేవీపీవై ఫెలోషిప్‌ అర్హత పొందిన అభ్యర్థులను వారి ర్యాంక్‌ ప్రకారం నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ కేటగిరీ ద్వారా పదిమందికి అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ సంస్థ నిబంధనల ప్రకారం నాలుగో సెమిస్టర్‌ నుంచి ప్రతినెలా స్టయిపెండ్‌ చెల్లిస్తారు..

పరీక్ష లో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. స్పెషలైజేషన్‌కు 20 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ మొదటి రెండేళ్లు నెలకు రూ.12,000ల స్టయిపెండ్‌ ఇస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్‌ అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.ఆసక్తి కలిగిన విద్యార్థులు వెబ్ సైట్ www.iacs.res.in అప్లై చేసుకోవచ్చు..నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news