ప్రపంచం కరోనాతో బాధ పడుతుంటే… మన తెలుగు రాష్ట్రాల్లో వడియాలు పెడుతున్నారు..!

-

వేసవి కాలం వచ్చింది అంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలు ఏంటీ అంటే… వేసవిలో ఆవకాయ పట్టడం వడియాలు ఏడాది మొత్తం సరిపోయే విధంగా రెడీ చేసుకోవడం… వంటివి చేస్తూ ఉంటారు. ఎంత బిజీ గా ఉన్నా సరే ఎండా కాలం అయిపోయే లోపు ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్లకు ఎన్ని పనులు ఉన్నా సరే దీనినే ప్రధానంగా తీసుకుంటారు మన వాళ్ళు.

ఇప్పుడు కరోనాతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఈ తరుణంలో మన ఆడాళ్ళు అందరూ కూడా… కరోనా వైరస్ ని పట్టించుకోకుండా… భర్తలను సరుకులు తీసుకుని రావాలని డిమాండ్ చేస్తూ వడియాలు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే సీన్ నడుస్తుంది ఇప్పుడు. తాజాగా ఒక అమ్మాయి… వడియాలు వేరే ఇంట్లో ఎండ బెట్టడానికి గానూ బండి మీద వెళ్తూ పోలీసులకు దొరికింది.

ఎందుకు వెళ్తున్నావ్ అమ్మా అంటే వడియాలు ఎండ బెట్టడానికి అని చెప్పడం చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏది ఎలా ఉన్నా ప్రపంచం మొత్తం ప్రాణాలతో భయపడుతున్నా సరే మనకువచ్చిన ఇబ్బంది ఏమీ లేదని భావిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆడాళ్ళు వడియాలు పట్టడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యమే. ఇది కదా ఆత్మవిశ్వాసం అంటే అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news