టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేసి బిఎస్పిలో చేరాలి: ఆర్ఎస్ ప్రవీణ్

-

బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం రోజు హనుమకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వెంటనే రాజీనామా చేసి బిఎస్పిలో చేరాలని పిలుపునిచ్చారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేతుల్లో కబ్జాకు గురైందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రగతిభవన్ పై బీఎస్పి జెండా ఎగర వేస్తామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్పికి అధికారం అప్పగిస్తే కులమతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామన్నారు. అర్హులైన కుటుంబాల నుంచి ఒకరికి విదేశాల్లో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ వంద రోజుల్లో 15 వేల కిలోమీటర్లు పర్యటించి 750 గ్రామాలను సందర్శించామని, గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తమకు కనిపించలేదని అన్నారు. 2023 లో రాజ్యాధికారం దిశగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news