దీపావళికి మీ ఇంటిని ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..

-

దీపావలి పండుగ ఈ ఏడాది అక్టోబర్ 24 కు వచ్చింది.అందుకే అందరూ ఇంటిని అలంకరించే పనిలో ఉన్నారు.ఇంటికి రంగులు వేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఇంటి కర్టెన్లు కూడా మారుస్తున్నారు. కొన్నిచోట్ల కొత్త ఫర్నీచర్ కొంటున్నారు.  ఇంటిని అలంకరించడంలో వాస్తు నియమాలు చాలా ముఖ్యమైనవి.దీపావళి నాడు వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిని సిద్ధం చేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇల్లు అందంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఆమె అనుగ్రహంతో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పెరుగుతాయని విశ్వాసం. ఈ వాస్తు చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

దీపావళి రోజున క్లీన్ చేసేటపుడు మెయిన్ డోర్ ను బాగా శుభ్రం చేయండి. ప్రధాన ద్వారంలో తలుపు తుప్పుపట్టి సౌండ్ చేస్తే దాన్ని వెంటనే పరిష్కరించండి. తలుపు నుండి ఎలాంటి శబ్దం వచ్చినా అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం మీద వెండి శిల్పాలు ,ప్రవేశ ద్వారం మీద లక్ష్మి గుర్తులు ఉంచండి. తలుపును అలంకరించడానికి, మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల  లక్ష్మీదేవి సంతోష పడుతుంది..

ఈశాన్య మూలను సరిగ్గా శుభ్రం చేయండి. ఈశాన్య మూల భగవంతుని స్థానమని గుర్తుంచుకోండి, కాబట్టి ఈ స్థలం శుభ్రంగా, ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం. ఈశాన్య మూలలో అనవసరమైన వస్తువులను ఉంచవద్దు. ఇలా చేయడంతో తల్లి లక్ష్మికి కోపం వచ్చి కోపంతో వెళ్లిపోతుంది..ఇంటి బ్రహ్మ స్థానము ఈశాన్య కోణము తరువాత, గృహములో అతి ముఖ్యమైనది బ్రహ్మ స్థానము.

ప్రతి ఇంటికి మధ్య భాగం బ్రహ్మ స్థానం. ఈ స్థలం బహిరంగంగా, శుభ్రంగా, ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం. ఈ స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయండి. ఇక్కడ ఏదైనా భారీ ఫర్నిచర్ ఉంచినట్లయితే, దానిని తీసివేయండి..అవసరం లేని వస్తువులను అక్కడ ఉంచకండి..

ఇకపోతే దీపావళికి ముందు ఇంటి నుండి చాలా కాలంగా ఉపయోగించని వస్తువులను వదిలించుకోండి. పాత పాడైపోయిన పూలు, పాత జంక్ వస్తువులు, వార్తాపత్రికల స్క్రాప్‌లు, పగిలిన గాజులు, పాత బూట్లు, చెప్పులు, ఇవన్నీ వాస్తులో మంచివి కానివిగా భావిస్తారు.దీపావళికి ముందు ఈ వస్తువులన్నీ ఇంట్లో నుండి తీసివేయాలి. పాత వ్యర్థాలు ఒక రకమైన ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి డబ్బు రాకకు అడ్డంకులు సృష్టిస్తాయని నమ్ముతారు..అందుకే వాటిని తీసి వెయ్యడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news