చేతగాని వాళ్ళు మాట్లాడేవన్నీ పట్టించుకోవద్దు: ఎర్రబెల్లి దయాకర్ రావు

-

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి లో పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ ,బిజెపి పార్టీలు అన్నిరకాలుగా అన్యాయం చేశాయని అన్నారు. గ్రామాలను గత్తరలేపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి పాలకులు గ్రామాలను కనీసం పట్టించుకోలేదు.. నీళ్లు లేవు, నిధులు లేవు, పనులు లేవు మొత్తం ప్రజలు కుల వృత్తులు ఆగమై వలసపోయే దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న రాష్ట్రము అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. తెలంగాణలోని పల్లెలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణకు చాలా అవార్డులు కేంద్రమే ఇస్తుందని.. మల్లి వారే తెలంగాణలో ఏమీ జరగడం లేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చేతగాని వాళ్ళు ఏదేదో మాట్లాడుతారు అవన్నీ పట్టించుకోవద్దు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news