గోదావరిఖనిలో మద్యం మత్తులో యువకుల హల్చల్..భయాందోళనకు గురైన ప్రజలు!

-

దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొందరు యువకులు మద్యం సేవించి నానా రభస చేశారు. ప్రతి ఏటా స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. రావణాసురుడి దహన కార్యక్రమం ఉంటుంది.దీంతో పట్టణంలోని ప్రజలంతా ఆ వేడుకను వీక్షించేందుకు కుటుంబాలతో కలిసి వస్తుంటారు.

ఈ క్రమంలోనే జనాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దసరా వేడుకలు జరుగుతున్న క్రమంలో కొందరు యువకులు మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో విపతీరమైన జనాల మధ్య ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. దీంతో దసరా ఉత్సవాలు వీక్షించేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక గ్రూపు మొత్తం కలిసి ఇద్దరు యువకులపై దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version