ఇండియాకు గుడ్ న్యూస్.. దేశంలో కొత్తగా 50వేల కరోనా కేసులు నమోదు

-

మన దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌.. నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గిపోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 50407 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,86,544 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,10,443 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 804 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,07,981 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,36,962 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,14,68,120 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 46,82,662 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news