ఇండియాలో భారీగా తగ్గిన కరోనా.. ఇవాళ కేవలం 30 వేల కరోనా కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గిపోయింది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 30757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,54,315 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,32,918 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 541 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,10,413 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 67538 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,19,10,984 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,74,24,36,288 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 34,75,951 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news