ఏపీలో కరోనా టెర్రర్..కొత్తగా 6996 కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించినా అప్పటికిని వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. ఇక తాజాగా ఏపీలో మరో సారి కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా 6996 కరోనా కేసులు నమోదయ్యాయి.

ap carona
ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,17, 384 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 514 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36108 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1066 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 66 , 762 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38, 055 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,19,22,969 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news