ఇండియాలో కొత్తగా 1225 కరోనా కేసులు, 28 మరణాలు నమోదు

-

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1225 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,24,440 కు చేరింది.


ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,307 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.76 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 28 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,129 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1594 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,89,004 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,84,06,55,005 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 22,27,307 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version