భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం – పురందేశ్వరి

-

భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. మంగళవారం విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి పెద్దపీట వేస్తూ కేంద్రం అభివృద్ధి చేసిందని అన్నారు.

సౌభ్రాతృత్వ భావనతో అందరం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయంలో దేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు పురందేశ్వరి. మనదేశంలో ఉన్న శాంతియుత వాతావరణం మరే దేశంలోనే లేదని అన్నారు. అనాదిగా వస్తున్న హైందవ విధానాలు ప్రధాన కారణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version