India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్‌పై భారత్ విజయం

-

టి – 20 మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయంం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ అధ్యంతం నరాలు తెగే ఉత్కంఠగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ బ్యాటింగ్.. రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (4), సూర్య కుమార్ యాదవ్ (15), విఫలమైన వేళ విరాట్ కోహ్లీ (82) నాటౌట్ గా భారత్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. విరాట్ కోహ్లీ – అశ్విన్ (1) కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news