ప్రయాణికులకు అలర్ట్‌.. ఒక్కరోజే 155 రైళ్లు రద్దు..

-

వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే శాఖ. ఈ మేరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. మరో 55 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు.

SCR cancels 10 trains functioning from Hyderabad

26 రైళ్ల స్టేషన్లను మార్చామని, 17 రైళ్లను రీషెడ్యూల్ చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని కోరారు. ప్రయాణికుల టిక్కెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, వాటికి సంబంధించిన నగదు యూజర్ల అకౌంట్లలోకి రీఫండ్ అవుతుందని వెల్లడించారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర రీఫండ్ పొందవచ్చని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news